TTD: శ్రీవారి ఆనందనిలయం చిత్రీకరణ కేసులో నిందితుడి అరెస్టు
శ్రీవారి ఆనంద నిలయాన్ని వీడియో చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుమల: శ్రీవారి ఆలయంలోని ఆనందనిలయాన్ని మొబైల్ద్వారా వీడియో తీసిన నిందితుడిని అరెస్టు చేశామని తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్కు చెందిన రాహుల్రెడ్డిని(19)ని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తిరుమల వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏఎస్పీ వెల్లడించారు.
నిందితుడు రాహుల్రెడ్డి కరీంనగర్లో సీఏ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు చెప్పారు. ఇతను ఆలయాలను సందర్శించిన సమయంలో తన సెల్ఫోన్లో ఆలయాన్ని వీడియోతీసి స్టేటస్లో పెట్టుకునేవాడని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీ సాయంత్రం రాహుల్రెడ్డి తన సెల్ఫోన్ తీసుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనానికి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడు ఉద్దేశపూర్వకంగానే సెల్ఫోన్ను భద్రతా సిబ్బంది తనిఖీలకు దొరక్కుండా దాచుకుని వెళ్లాడు. ఆలయంలోకి వెళ్లిన ఇతను స్వామివారిని మరుసటి రోజు అర్ధరాత్రి 12.15 నుంచి 12.20 గంటల సమయంలో దర్శించుకుని 8వ తేదీన ఆలయం వెలుపలకు వచ్చాడు. అనంతరం ఆలయం వెలుపల బంగారు బావి వద్ద నుంచి వీడియోను చిత్రీకరించినట్లు తెలిపారు.
గర్భాలయంలో చిత్రీకరణ చేయలేదని ఏఎస్పీ వెల్లడించారు. చిత్రీకరించిన వీడియోను తన స్టేటస్లో పెట్టుకోవడంతోపాటూ తన చెల్లెలికి పంపాడు. అనంతరం 3 గంటలకు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయానికి వెళ్లి అక్కడి నుంచి తిరుపతి రైల్వేస్టేషన్కు చేరుకుని రైలులో స్వస్థలానికి చేరుకున్నాడు. ఇంతలో సదరు వీడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన సెల్ఫోన్లోని వీడియోను తొలగించి ఆఫ్చేశాడు. కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు రాహుల్ చేసిన పని తప్పుగా భావించి వారి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఆలయంలో వీడియో చిత్రీకరణపై తితిదే విజిలెన్స్ అధికారులు తిరుమల వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వన్టౌన్ సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, సుధాకర్లతో రెండు ప్రత్యేక బృందాలను, ఒక టెక్నికల్ టీమ్ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి క్లూస్లేని ఈ వీడియో చిత్రీకరణ కేసును సాంకేతికంగా, సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితుడిని పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడు ఆకతాయితనంతోనే ఈ నేరానికి పాల్పడ్డాడని దర్యాప్తులో గుర్తించామన్నారు. అతని సెల్ఫోన్లోని ఇతర ఆలయాలకు సంబంధించి తీసుకున్న వీడియోలను పరిశీలించామని తెలిపారు. చిన్నవయస్సులోనే భక్తిభావం కలిగిన ఇతను అత్యుత్సాహంతో, ఆకతాయిగా చేసిన తప్పునకు చట్టప్రకారం చర్యలు తప్పవని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు