Andhra News: పెదబయలు తహసీల్దార్‌ ఆత్మహత్య

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో విషాదం చోటుచేసుకుంది. మండల తహసీల్దార్‌ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 08 Dec 2022 12:16 IST

పెదబయలు రూరల్‌: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో విషాదం చోటుచేసుకుంది. మండల తహసీల్దార్‌ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన.. టిఫిన్‌ తీసుకురావాలని అటెండర్‌కు సూచించారు. అటెండర్‌ తిరిగి కార్యాలయానికి వెళ్లే సరికి పక్కనే ఉన్న ఓ షెడ్‌లో శ్రీనివాసరావు ఉరివేసుకుని మృతిచెందడాన్ని గుర్తించారు.  

ఇటీవల పాడేరు కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి తహసీల్దార్‌ శ్రీనివాసరావు వెళ్లారు. ఈ సమావేశంలో భూముల రీసర్వే విషయంలో ఉన్నతాధికారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తహసీల్దార్‌ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని