‘తీన్మార్‌ మల్లన్నపై కేసుల్లో 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి’

చింతపండు నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న)పై వేధింపులు, నమోదు చేసిన కేసులపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ను

Updated : 11 Aug 2021 05:48 IST

ఈనాడు, దిల్లీ: చింతపండు నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న)పై వేధింపులు, నమోదు చేసిన కేసులపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ను జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్సీబీసీ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి నోటీసులు జారీ చేశారు. తనపై పోలీసులు 30కిపైగా తప్పుడు కేసులు మోపారని తీన్మార్‌ మల్లన్న ఎన్సీబీసీకి లేఖ రాశారు. లేఖకు ఎన్సీబీసీ సభ్యుడు ఆచారి స్పందించారు. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించకపోతే కమిషన్‌కు ఉన్న అధికారాలతో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ సమన్లు జారీ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని