Road Accident: బైకును ఢీకొన్న లారీ.. ముగ్గురు యువకుల దుర్మరణం

బైకును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పో్యిన ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని ధర్మోజిగూడెం సమీపంలో చోటు చేసుకుంది. ..

Updated : 28 Aug 2021 10:30 IST

చౌటుప్పల్‌: బైకును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని ధర్మోజిగూడెం సమీపంలో చోటు చేసుకుంది. వేబ్రిడ్జి నుంచి లారీని రివర్స్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ ఉన్నట్టుండి ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో బైకు దాన్ని ఢీకొంది. మృతుల్లో ఒకరు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వాసి హరీశ్‌, మరో ఇద్దరు హైదరాబాద్‌ రామాంతాపూర్‌ వాసులుగా గుర్తించారు. పిట్టంపల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన జరిగింది. ఈ ముగ్గురు యువకులు హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌లుగా పని చేసేవారిగా గుర్తించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని