TS News: విద్యార్థినులను వేధించిన కీచక ఉపాధ్యాయుడికి 21 ఏళ్ల జైలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడికి  కఠిన శిక్ష విధిస్తూ కొత్తగూడెంలోని పోక్సో..

Updated : 28 Aug 2021 07:27 IST

కొత్తగూడెం గ్రామీణం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడికి కఠిన శిక్ష విధిస్తూ కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ శుక్రవారం తీర్పు వెల్లడించారు. నిందితుడు సునీల్‌కుమార్‌(40)కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.11 వేల జరిమానా విధించారు. ఎస్పీ సునీల్‌దత్‌ ఈ వివరాలను తెలిపారు. దొడ్డా సునీల్‌కుమార్‌ లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడు. గతేడాది కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడిన సమయంలో చదువు పేరిట కొందరు బాలికలను తరచూ పాఠశాలకు రప్పించేవాడు. అతడు తమపై  లైంగికదాడికి పాల్పడినట్లు అయిదుగురు బాలికలు డిసెంబరు 14న తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎస్సై అంజయ్య మరుసటి రోజు పోక్సో కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు