Crime News: సరదాగా రమ్మంటే హత్య చేసి వెళ్లాడు!

ప్రియురాలిని కలిసేందుకు వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన ప్రియుడు తనతో రావాలని కోరగా ఆమె నిరాకరించడంతో హత్యచేసిన ఘటన మంగళవారం రాత్రి

Updated : 11 Aug 2021 06:45 IST

ప్రియురాలిని చంపిన ప్రియుడు

జీడిమెట్ల, న్యూస్‌టుడే: ప్రియురాలిని కలిసేందుకు వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన ప్రియుడు తనతో రావాలని కోరగా ఆమె నిరాకరించడంతో హత్యచేసిన ఘటన మంగళవారం రాత్రి జీడిమెట్ల ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన పూజ(21), రాజేశ్‌ వర్మ ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకొని నగరానికి వచ్చి జీడిమెట్ల వినాయక్‌నగర్‌లో అద్దెకుంటున్నారు. భర్త స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె గృహిణి. మాజీ ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ.. సరదాగా ప్రియుడిని చూసేందుకు నగరానికి రావాల్సిందిగా కోరింది. 24 గంటల్లో ఓ స్నేహితుడిని వెంటబెట్టుకొని వచ్చి కలిశాడు. తన వెంట రావాలని ఇద్దరం కలిసుందామని కోరాడు. ఆమె నిరాకరించడంతో దిండుతో పూజను ఊపిరాడకుండా చేసి చంపేసి పరారయ్యాడు. హత్యపై భర్త రాజేశ్‌ వర్మ ఇచ్చిన ఫిర్యాదులో కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని