Accident: పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 06 Oct 2021 15:55 IST

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బట్టుపల్లి సమీపంలోని గాడుదలగండి గుట్టపైన బస్సు-కారు ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. మంథని నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి దూసుకెళ్లాయి. ప్రమాదంలో మంథని మండలం ఖాన్‌సాయిపేటకు చెందిన కారు డ్రైవర్‌ వినోద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు ఉండగా 11 మందికి గాయాలయ్యాయి. ఇందులో తీవ్రంగా గాయపడిన భూపాలపల్లికి చెందిన లక్ష్మి, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సోఫియా, శ్వేత, మరియా, అంజయ్యను మెరుగైన చికిత్స కోసం గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. వీరిలో లక్ష్మి, మరియా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని