Khammam: చేపల పెట్టెల్లో రూ.8 కోట్ల విలువైన గంజాయి
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో కలిపి మొత్తంగా రూ.8 కోట్లకు పైగా విలువైన 4,483 కిలోల గంజాయిని పోలీసులు
భద్రాద్రి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో కలిపి మొత్తం రూ.8 కోట్లకు పైగా విలువైన 4,483 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో రూ.7.30 కోట్లు, ఖమ్మం గ్రామీణ పరిధిలో రూ.1.98 కోట్లు విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి పరిధిలోని విద్యానగర్లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన రెండు లారీలను పోలీసులు తనిఖీ చేశారు. రెండు లారీల్లోనూ చేపల పెట్టెల్లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. రెండు లారీల్లో కలిపి మొత్తంగా 3,653 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా చింతూరు నుంచి హైదరాబాద్ మీదుగా హరియాణాకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఖమ్మం సీపీ విష్ణు వారియర్ వెల్లడించారు. మరోవైపు ఖమ్మం గ్రామీణం పరిధిలోనూ రూ.1.98 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా