Nagaland: మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్ గురితప్పి.. 13 మంది మృతి
నాగాలాండ్లోని మోన్ జిల్లా ఓటింగ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మోన్: నాగాలాండ్లోని మోన్ జిల్లా ఓటింగ్ అనే ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం సాయంత్రం భద్రతాబలగాలు మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 13 మంది మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అసలేం జరిగింది..?
తిరు బొగ్గు గని నుంచి ఒటింగ్ గ్రామం మధ్యలో ‘నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’ మిలిటెంట్ గ్రూప్ సభ్యుల కదలికలు ఉన్నట్లు భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. అక్కడి కార్మికులు ఆదివారం కుటుంబాలతో గడిపేందుకు శనివారం సాయంత్రం బొగ్గుగనుల నుంచి బయల్దేరతారు. అదే విధంగా డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం సమయంలో బొగ్గు గనిలో పనులు ముగించుకొని కొందరు కార్మికులు పికప్ ట్రక్పై ఇళ్లకు బయల్దేరారు. అదే సమయంలో గాలింపు చేపట్టిన భద్రతా దళాలు వీరిని మిలిటెంట్లుగా అనుమానించి కాల్పులు జరిపాయి. శనివారం సాయంత్రమే ఆరుగురు చనిపోయారు.
తమ వారు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఓటింగ్ గ్రామం నుంచి కొందరు గాలించేందుకు వెళ్లారు. వారికి మృతదేహాలు కనిపించాయి. దీనిపై ఆగ్రహించిన స్థానికులు భద్రతా బలగాల వాహనాలను దహనం చేశారు. ఆదివారం ఉదయానికి మృతుల సంఖ్య 13కు పెరిగింది. మరో 11 మంది గాయపడగా.. ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ప్రధాన నగరం మోన్కు తరలించారు. మరోవైపు ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయ్ప్యూ రియో ఈ ఘటనపై స్పందించారు. ఓటింగ్ అనే ప్రదేశం వద్ద జరిగిన కాల్పుల్లో పౌరుల మృతిచెందడం దురదృష్టకరమన్నారు. దీనిపై సిట్ దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. అస్సాంలోని నాగోన్ లోక్సభ సభ్యుడు ప్రద్యుత్ బోర్డ్లోయ్ ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను ట్వీట్ చేశారు.
నమ్మకమైన సమాచారంతోనే ఆపరేషన్ : అస్సాం రైఫిల్స్
ఆర్మీ 3 కోర్ ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. నమ్మకమైన సమాచారం లభించడంతోనే తాము ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి విచారణ చేపట్టి బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని పేర్కొంది. ఈ ఘటన అనంతర పరిణామాల్లో ఒక జవాను మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారని పేర్కొంది.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ట్విటర్లో స్పందించారు.‘‘మోన్ జిల్లా ఒటింగ్ వద్ద జరిగిన ఘటన తీవ్ర వేదనకు గురిచేసింది. మృతులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సిట్ ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతుంది’’ అని పేర్కొన్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా కూడా ఒటింగ్ ఘటనపై స్పందిస్తూ.. మృతులకు సంతాపం తెలియజేశారు. గాయపడినవారు వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం