Khammam: తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని

Updated : 12 Aug 2021 21:36 IST

చింతకాని: తల్లి మందలించిందని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన బాలిక (16) ఖమ్మంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చుదువుతోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు జరగడం లేదు. ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాఠాలు వినకుండా మొబైల్‌లో వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటడం గమనించిన తల్లి.. బాలికను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రియాంక తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని