Crime News: నాటు వైద్యం చేయిస్తానని.. 13ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం
కరోనాతో బాధపడుతున్న మైనర్ బాలికకు నాటు వైద్యం చేయిస్తామని మాయమాటలు చెప్పి.. బాలికతో వ్యభిచారం చేయించిన ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు
గుంటూరు: కరోనాతో బాధపడుతున్న మైనర్ బాలికకు నాటు వైద్యం చేయిస్తామని మాయమాటలు చెప్పి.. బాలికతో వ్యభిచారం చేయించిన ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసులో మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు, కారు, ప్రామిసరీ నోట్లు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే... పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, కూతురికి కరోనా సోకడంతో గుంటూరు జీజీహెచ్లో చేర్పించగా భార్య చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్లో చనిపోయింది. పల్నాడులోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలికకు 13 ఏళ్లు. బాలికకు తండ్రి తప్ప మరెవరు లేరు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ నాటువైద్యం చేయిస్తానని తండ్రిని నమ్మించి బాలికను ఆమె వెంట తీసుకెళ్లింది. ఆ తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఆ పనిచేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి బయటకు రానీయకుండా కొన్నాళ్లు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ తీసుకెళ్లి వ్యభిచారం చేయించారు.
నెల్లూరులో వారి చెర నుంచి తప్పించుకుని పారిపోయి విజయవాడ వచ్చిన బాలికను మరో ముఠా అదుపులోకి తీసుకుని బలవంతంగా తిరిగి వ్యభిచారం చేయించారు. బాలిక.. తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో.. తండ్రి మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకి తెలుసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 23 మందిలో మొత్తం 10మంది ఆర్గనైజర్స్ ఉన్నట్టు ఎస్పీ వివరించారు. ఈకేసులో మరికొందరి పాత్ర కూడా ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)