TS News: 3 నెలల చిన్నారి, తండ్రిని కాటేసిన పాము..

మూడు నెలల చిన్నారితో పాటు తండ్రిని పాము కాటేసిన ఘటన మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

Updated : 07 Nov 2021 13:14 IST

మహబూబాబాద్‌ (నెహ్రూ సెంటర్‌) : మూడు నెలల చిన్నారితో పాటు తండ్రిని పాము కాటేసిన ఘటన మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఏకుల క్రాంతి, మమత దంపతులు.. కుమార్తె(3నెలల చిన్నారి)తో కలిసి శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోయారు. ఆ సమయంలో పసికందును పాము కాటేయడంతో ఏడవటం ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు ఏమైందో అని లేచి చూస్తుండగానే క్రాంతిని సైతం పాము కాటేసింది. వెంటనే వీరిరువురిని మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. ఇంకా పేరు పెట్టని మూడు నెలల చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్రాంతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని