యువకుల కిడ్నాప్.. బంధువుల అదృశ్యం
ఛత్తీస్గఢ్ అడవుల్లో యువకుల కిడ్నాప్ కలకలం రేపింది. జగర్గుండా ప్రాంతంలోని కుందేడ్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ నెల 18న కొంతమంది
సుక్మా: ఛత్తీస్గఢ్ అడవుల్లో యువకుల కిడ్నాప్ కలకలం రేపింది. జగర్గుండా ప్రాంతంలోని కుందేడ్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ నెల 18న కొంతమంది నక్సల్స్ ఆయుధాలతో కుందేడ్ గ్రామానికి వచ్చి ఏడుగురు యువకులను బలవంతంగా తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే వీరిని కాపాడేందుకు వెళ్లిన బంధువులు కూడా అదృశ్యమవడం గమనార్హం. కిడ్నాప్ అయిన యువకులను కాపాడేందుకు నలుగురు వ్యక్తులు అడవిలోకి వెళ్లగా.. వారు ఇంతవరకూ తిరిగిరాలేదు. కాగా.. యువకుల కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అపహరణకు గురైన యువకులు ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ కారణంగానే నక్సల్స్ వీరిని కిడ్నాప్ చేసి అజ్ఞాత ప్రాంతానికి తీసుకెళ్లి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా