Tamil Nadu: వాననీటిలో చిక్కిన కారు.. వైద్యురాలి మృతి
రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీటిలో కారు చిక్కుకొని ఓ వైద్యురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుక్కోట జిల్లా తురైయూర్ పరిధికి చెందిన శివకుమార్, సత్య(35) దంపతులు.
కాంచీపురం, న్యూస్టుడే: రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీటిలో కారు చిక్కుకొని ఓ వైద్యురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుక్కోట జిల్లా తురైయూర్ పరిధికి చెందిన శివకుమార్, సత్య(35) దంపతులు. కృష్ణగిరి జిల్లా హోసూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో సత్య వైద్యురాలిగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అత్తగారితో కలిసి ఆమె కారులో తురైయూర్కు బయలుదేరారు. తురైయూర్ సమీపానికి చేరుకోగానే భారీ వర్షం మొదలైంది. దీంతో అక్కడ ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వాననీరు చేరింది. ఆ మార్గంలోనే వెళ్తున్న వీరి కారు నీటిలో చిక్కుకుపోయింది. సత్య అత్తగారు కారులోనుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. డ్రైవింగ్ సీటులో ఉన్న సత్య సీటుబెల్టు లాక్ అవడంతో బయటకురాలేక ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్