Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న సహా అయిదుగురిపై కేసు
నిజామాబాద్ జిల్లా జానకంపేటకు చెందిన కల్లు ముస్తేదారు(విక్రయదారుడు) జయవర్ధన్గౌడ్ను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్న అయిదుగురిపై కేసు నమోదు...
ఎడపల్లి, న్యూస్టుడే: నిజామాబాద్ జిల్లా జానకంపేటకు చెందిన కల్లు ముస్తేదారు(విక్రయదారుడు) జయవర్ధన్గౌడ్ను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్న అయిదుగురిపై కేసు నమోదు చేసినట్లు బోధన్ ఏసీపీ రామారావు తెలిపారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బులు ఇవ్వాలంటూ జానకంపేటకు చెందిన జయవర్ధన్గౌడ్ను అదే గ్రామానికి చెందిన సంతోష్, రాధాకిషన్గౌడ్, సాయాగౌడ్, రాజుగౌడ్ అనే వ్యక్తులు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నతో కలిసి కొన్ని రోజుల కిందట బెదిరించారు. జయవర్ధన్గౌడ్ భయపడి గత ఆగస్టులో రూ.5 లక్షలు ఇచ్చారు. తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఉందని, మరో రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండు చేశారు. దీంతో బాధితుడు గత గురువారం ఆ అయిదుగురిపై ఫిర్యాదు చేశారు. అందులో సంతోష్ను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని, మిగిలిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఏసీపీ శనివారం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా