TS News: యాదాద్రికి వెళ్లిన దివ్యాంగుడి మృతి
కుమార్తె పుట్టిందని తలనీలాలను సమర్పించడానికి యాదాద్రి క్షేత్రానికి వెళ్లిన ఓ దివ్యాంగుడు మరుసటి రోజు ఛాతీలో, కడుపులో నొప్పి అంటూ ఆసుపత్రిలో చేరి హైదరాబాద్లో మృతి చెందారు. పుణ్య క్షేత్రం వద్ద సెక్యూరిటీ సిబ్బంది కొట్టిన దెబ్బల వల్లే తన కుమారుడు మృతి
భద్రతా సిబ్బంది కొట్టడం వల్లేనని తండ్రి ఫిర్యాదు
యాదగిరిగుట్ట పట్టణం, పాలమూరు, న్యూస్టుడే: కుమార్తె పుట్టిందని తలనీలాలను సమర్పించడానికి యాదాద్రి క్షేత్రానికి వెళ్లిన ఓ దివ్యాంగుడు మరుసటి రోజు ఛాతీలో, కడుపులో నొప్పి అంటూ ఆసుపత్రిలో చేరి హైదరాబాద్లో మృతి చెందారు. పుణ్య క్షేత్రం వద్ద సెక్యూరిటీ సిబ్బంది కొట్టిన దెబ్బల వల్లే తన కుమారుడు మృతి చెందినట్లు తండ్రి నారాయణగౌడ్ మంగళవారం మహబూబ్నగర్ రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ‘‘మామూలుగా చనిపోయాడని అనుకున్నాం. కాల్ రికార్డు విన్నాక యాదాద్రి సెక్యూరిటీ పోలీసులు కొట్టిన దెబ్బలే మరణానికి కారణమని అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు. మహబూబ్నగర్ శ్రీనివాస కాలనీకి చెందిన కార్తీక్ గౌడ్ (32) దివ్యాంగుడు. ఎడమకాలికి పుట్టుకతోనే అవస్థ ఉంది. అటవీశాఖ పరిధిలోని మయూరీ నర్సరీలో తాత్కాలిక పద్ధతిపై టికెట్ కౌంటర్లో నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. 15 రోజుల క్రితం ఆయన భార్య తొలి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మొక్కు ఉండటంతో ఆదివారం సాయంత్రం ఆయన ఒక్కరే యాదాద్రికి వెళ్లారు. వెళ్లేసరికి అర్ధరాత్రి అయింది. గదుల కోసం మొదటి ఘాట్రోడ్డు వద్ద తిరుగుతుండగా భద్రతా సిబ్బంది కొడుతున్నారని జడ్చర్లలోని తన బంధువు ఒకరికి ఫోన్ చేశారు.
సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేస్తా
రికార్డయిన సంభాషణల ప్రకారం.. ‘మామూలుగా వెళ్తున్న నన్ను పిలిచి కొట్టారు. నేను దివ్యాంగుడిని.. పరిగెత్తలేను అన్నా విన్లేదు. అటవీశాఖలో పనిచేస్తున్నానని ఆధారం చూపించగా ‘మాకు చూపిస్తావా’ అని కర్రతో ఇంకా కొట్టారు. వారి పక్కనే మద్యం సీసాలున్నాయి. కొట్టడానికి వారికి హక్కు ఎవరిచ్చారు? సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేస్తా’’ అని కార్తీక్ ఆవేదన వ్యక్తంచేశారు. బంధువు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ‘‘సమాచారం తెలిసి గొడవ జరుగుతున్నప్పుడే అక్కడికి వెళ్లాం. వాగ్వాదాన్ని ఆపి అక్కడి నుంచి కార్తీక్ను పంపించాం’’ అని యాదగిరిగుట్ట పట్టణ పోలీస్స్టేషన్ ఎస్సై-1 రామకృష్ణారెడ్డి తెలిపారు.
బస్టాండులో ఛాతీలో నొప్పితో విలవిల
సోమవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ బస్టాండు నుంచి బంధువులకు ఫోన్ చేసిన కార్తీక్.. తలనీలాలను సమర్పించి తిరిగి ఇంటికి బయల్దేరానని, కడుపు, ఛాతీలో బాగా నొప్పి వస్తోందని చెప్పారు. వారి సూచనతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన ఆయన అక్కడ 12.50 గంటలకు మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా ఎస్సై రమేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?