Murder: అరెకరం కోసం ఘర్షణ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్య
అర ఎకరం భూమి కోసం రెండు వర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. కర్ణాటకలోని బాగలకోటె
కర్ణాటకలో దారుణం
బాగలకోటె, న్యూస్టుడే: అర ఎకరం భూమి కోసం రెండు వర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. కర్ణాటకలోని బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా మధురఖండి గ్రామంలో శనివారం సాయంత్రం ఈ దారుణం వెలుగుచూసినట్లు బాగలకోటె పోలీసులు తెలిపారు. హతులను అన్నదమ్ములైన బసవరాజ్ ముదరడ్డ్డి (36), ఈశ్వర్ ముదరడ్డి (40), మల్లప్ప ముదరడ్డి (44), హనుమంత ముదరడ్డిగా (48) గుర్తించారు. రెండు వర్గాల నడుమ అర ఎకరా భూమి కోసం పదేళ్లుగా వివాదం కొనసాగుతోంది. శనివారం ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు దాడిచేసి నలుగురు సోదరులను హతమార్చారు. ఈ సంఘటనలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్