TS News: చెరువులో తేలిన చిరుత కళేబరం
చెరువు నీటిలో చిరుత కళేబరం తేలడం మండలంలోని ఖాజాపూరు గ్రామస్థులతో పాటు అటవీ శాఖ అధికారుల్లో విస్మయం కలిగించింది.
చనిపోయి పడి ఉండటంపై పలు అనుమానాలు
పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు
చిన్నశంకరంపేట, న్యూస్టుడే: చెరువు నీటిలో చిరుత కళేబరం తేలడం మండలంలోని ఖాజాపూరు గ్రామస్థులతో పాటు అటవీ శాఖ అధికారుల్లో విస్మయం కలిగించింది. మంగళవారం జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాలు.. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూరు గ్రామ శివారులోని ఉన్న పటేల్ చెరువులో చిరుత కళేబరం తేలి ఉండటాన్ని గమనించిన రైతులు, గ్రామస్థులు విషయాన్ని సర్పంచి నాగమణి దృష్టికి తీసుకురాగా వెంటనే సిబ్బందితో జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. చిరుత దేహంపై ఎలాంటి గాయాలు లేవని, విషాహారం తినడం వల్లే చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అదే విధంగా శరీరంపై ముళ్ల పంది ముళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. స్థానిక పశు వైద్యాధికారి గీతామాలిక శవపరీక్ష నిర్వహించిన అనంతరం అక్కడే దహనం చేశారు. అటవీ శాఖ అధికారి నజియా తబుసుం, సిబ్బంది కృష్ణా గౌడ్, గబ్బర్సింగ్ ఉన్నారు. ఏడాది కాలంగా మండల పరిధిలోని కామారం, మీర్జాపల్లి, కామారం తండా, చేగుంట మండలం వల్లూరు అటవీ ప్రాంతాల్లో నాలుగు చిరుతపులులు సంచరిస్తుండగా ఖాజాపూర్, చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా తిరిగినట్లు ఆనవాళ్లు లేవు. తాజాగా చిరుత ఖాజాపూర్ చెరువులో చనిపోయి పడి ఉండటంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!