Crime news: తల్లి, కుమార్తెకు విషమిచ్చి ఆపై తానూ తాగి.. 

నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని మోదుగులపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Updated : 23 Sep 2021 12:02 IST

ఇద్దరి మృతి.. నెల్లూరు జిల్లాలో ఘటన 

దొరవారిసత్రం: నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని మోదుగులపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు విషమిచ్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మేర్లపాక మురళి(40), తల్లి మస్తానమ్మ(60), కుమార్తె కావ్యశ్రీ(11)కి విషమిచ్చి ఆపై తానూ తాగాడు. గమనించిన స్థానికులు మురళి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే మస్తానమ్మ మృతి చెంది కనిపించింది. మురళి, కావ్యశ్రీని హుటాహుటిన సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. కావ్యశ్రీ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని