Crime news: కర్కోటకుడిగా మారిన కన్నతండ్రి.. మద్యం మత్తులో దాష్టీకం
చిన్నారి బోసినవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట మరణమృదంగం మోగింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పసిబిడ్డను మద్యంమత్తులో కన్న తండ్రే కసాయిగా మారి కడతేర్చిన ఘటన తీవ్ర విషాదం
మూడోసారీ ఆడపిల్ల పుట్టిందని నేలకేసి కొట్టడంతో శిశువు మృతి
నిందితుడు బాపురావు
కాగజ్నగర్ గ్రామీణం, వాంకిడి, న్యూస్టుడే: చిన్నారి బోసినవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట మరణమృదంగం మోగింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పసిబిడ్డను మద్యంమత్తులో కన్న తండ్రే కసాయిగా మారి కడతేర్చిన ఘటన తీవ్ర విషాదం నింపింది. మూడో సంతానం కూడా ఆడపిల్లే పుట్టిందని ఓ తండ్రి శిశువును నిర్దాక్షిణ్యంగా నేలకు కొట్టి బలితీసుకున్న హృదయవిదారక సంఘటన కుమురం భీం జిల్లా మారుమూల గిరిజన గ్రామమైన లైన్గూడలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాగజ్నగర్ గ్రామీణ ఎస్సై రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్నగర్ మండలంలోని లైన్గూడ పంచాయతీ కేంద్రానికి చెందిన గిరిజన దంపతులు మెస్రం బాపురావు-మనీషాలకు ఇద్దరు ఆడపిల్లలు మౌనిక(5), అశ్విని(3) ఉన్నారు. 45 రోజుల కిందట మూడో సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి బాపురావు రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. సోమవారం రాత్రి అతడు బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మౌనిక, అశ్విని టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లారు. ఇంట్లో మనీషాతో పాటు చిన్నారి ఉంది. భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. మత్తులో విచక్షణ కోల్పోయిన బాపురావు మంచంపై నిద్రిస్తున్న పసిపాపను బయటికి తీసుకొచ్చి నేలకు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత సర్పంచి ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో నిందితుడిని వాంకిడి పోలీసులు అదుపులో తీసుకున్నారు. మంగళవారం కాగజ్నగర్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు