Cyber Crime: క్రిప్టో కరెన్సీ పేరిట రూ.లక్షల్లో మోసాలు.. ముఠా అరెస్టు
క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. ముఠాలోని ముగ్గురి సభ్యులను
హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. ముఠాలోని ముగ్గురు సభ్యులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో నిందితుల ఖాతాల్లోని రూ.50లక్షలను నిలుపుదల చేశారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి చెక్బుక్లు, ఆరు ఏటీఎం కార్డులు, ఆరు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ సిలిగురికి చెందిన బ్యాంకు ఉద్యోగితో కలిసి ముఠాలోని చోటా భాయ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కమీషన్ పేరుతో 64 బ్యాంకు ఖాతాలను ముఠా సేకరించినట్లు వివరించారు. అధిక మొత్తం డబ్బు వస్తుందంటూ షెల్ కంపెనీల ఏర్పాటు చేసి నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ ముఠా 14 షెల్ కంపెనీలతో ఆన్లైన్లో పెట్టుబడులు సేకరించినట్లు విచారణలో తేలింది. నాంపల్లికి చెందిన వ్యక్తికి రూ.86లక్షల టోకరా వేసినట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.