Suicide: నృత్యం నేర్చుకునేందుకు ఇష్టం లేక బలవన్మరణం
నృత్య తరగతులకు వెళ్లడం ఇష్టం లేని కారణంగానే బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు నాలుగోపట్టణ పోలీసులు పేర్కొన్నారు. దొండపర్తిలో సోమవారం రాత్రి బాలిక బలవన్మరణానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం విదితమే.
బాలిక మృతిపై పోలీసుల దర్యాప్తు
గురుద్వారా(విశాఖ), న్యూస్టుడే: నృత్య తరగతులకు వెళ్లడం ఇష్టం లేని కారణంగానే బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు నాలుగోపట్టణ పోలీసులు పేర్కొన్నారు. దొండపర్తిలో సోమవారం రాత్రి బాలిక బలవన్మరణానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం విదితమే. దర్యాప్తులో భాగంగా బాలిక చదివే పాఠశాలకు వెళ్లి విద్యనభ్యసించే విధానంపై, ఇంట్లో ప్రవర్తనపై ఆరా తీశారు. ఈమె గతంలో ఓ నృత్యాలయంలో కూచిపూడి నేర్చుకునేది. ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల మాటపై గౌరవంతో బలవంతంగా వెళ్తుండేది. కరోనా కారణంగా ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేది. మంగళవారం నుంచి నృత్య తరగతులు మళ్లీ ప్రారంభం కానున్నాయని తెలుసుకొని వెళ్లడం ఇష్టంలేక మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.