Social Media: సామాజిక మాధ్యమంలో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకొని..

ఆ బాలికకు ఏం కష్టమొచ్చిందో తెలియదుకానీ.. అద్దం ముక్కతో కంఠం కోసుకుని ప్రాణాలు తీసేసుకున్న ఘటన అంబాజీపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గతంలో బాలిక కుటుంబం విజయవాడలో ఉంటోంది. ఇంటి

Updated : 29 Sep 2021 08:22 IST

అంబాజీపేట: ఆ బాలికకు ఏం కష్టమొచ్చిందో తెలియదుకానీ.. అద్దం ముక్కతో కంఠం కోసుకుని ప్రాణాలు తీసేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గతంలో బాలిక కుటుంబం విజయవాడలో ఉంటోంది. ఇంటి పెద్ద కొవిడ్‌తో చనిపోవడంతో కొడుకు, కూతురుతో అతని భార్య అంబాజీపేట మండలంలోని పుట్టింటికి వచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. పోలీసుస్టేషన్లో పంచాయితీలు కూడా జరిగాయి. ఈ గొడవలన్నింటికీ కారణం తనేనని అందరూ నిందిస్తున్నారంటూ మనస్తాపం చెందిన బాలిక(13) సోమవారం రాత్రి బాత్‌రూమ్‌లోకి వెళ్లి అద్దం ముక్కతో గొంతు కోసుకుని, అరుస్తూ బయటికొచ్చింది. గమనించిన కుటుంబసభ్యులు అమలాపురంలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చనిపోవడానికి ముందు రోజు గొంతువద్ద చాకు, అద్దం, బ్లేడు దేనితో కోసుకుంటే ఎంత సేపటికి చనిపోతామని తనను అడగడంతోపాటు సామాజిక మాధ్యమంలో చూస్తుండటంతో మందలించానని, ఇంతలోకే ఇలా చేసుకుందంటూ ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఘటనాస్థలాన్ని సీఐ సురేష్‌బాబు పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్యకుమార్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని