Crime News: మారు తండ్రి కర్కశత్వం.. గొంతు నులిమి రెండేళ్ల చిన్నారి హత్య

మారు తండ్రి కర్కశానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని రెండేళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకున్నాడు. అమానవీయమైన ఈ ఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం పాల్వంచ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం

Updated : 01 Dec 2021 08:59 IST

వర్షిణి

టేక్మాల్‌, న్యూస్‌టుడే: మారు తండ్రి కర్కశానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని రెండేళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకున్నాడు. అమానవీయమైన ఈ ఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం పాల్వంచ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ గ్రామానికి చెందిన బుర్ల రమణయ్య వ్యవసాయ కూలీ. అదే గ్రామానికి చెందిన సావిత్రి 2016లో అందోలు మండలం రోడ్లపాడుకు చెందిన సురేశ్‌ను రెండో వివాహం చేసుకొని వర్షిణికి జన్మనిచ్చింది. 2020లో  సావిత్రి సురేశ్‌ను వదిలేసి బిడ్డతో సహా మొదటి భర్త రమణయ్య దగ్గరకు వచ్చింది.  కొంతకాలం పాటు తల్లీ, పిల్లను రమణయ్య బాగానే చూసుకున్నాడు. సావిత్రి గర్భిణి కావడంతో మంగళవారం ఆమె, వర్షిణిలను టేక్మాల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. భార్యకు చికిత్స అనంతరం ఆమెను తెలిసిన వారి ద్విచక్ర వాహనంపై గ్రామానికి పంపించాడు. తను పాపతో కలిసి వస్తానని భార్యకు చెప్పి పంపాడు. మార్గం మధ్యలో పాప గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిన పాపను తీసుకుని అలాగే ఇంటికి వెళ్లాడు. భార్య నిలదీయగా చివరికి తానే హత్య చేసినట్లు రమణయ్య ఒప్పుకొన్నాడు. చుట్టుపక్కల వారు అల్లాదుర్గం సీఐ జార్జికి సమాచారం ఇవ్వగా ఆయన పాల్వంచ చేరుకుని వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని