Crime News: ఖమ్మం జిల్లాలో దారుణం..  రూ.100 కోసం వ్యక్తి హత్య

వంద రూపాయలు ఒకరి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది..

Updated : 14 Oct 2021 13:59 IST

ఖమ్మం: వంద రూపాయలు ఒకరి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.. మరొకరిని కటకటాల పాలు చేసింది. కూలి డబ్బులు రూ.100 కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించింది. బతుకుదెరువు కోసం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య వంద రూపాయల నోటు అగ్గి రాజేసింది. అందులో ఒకరి ప్రాణం పోయేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 మంది కూలీలు రెండు నెలల కిందట రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజరకు వ్యవసాయ పనులకు వచ్చారు.

ఓ రైతు వద్ద పని చేయగా వచ్చిన కూలీ డబ్బుల విషయంలో ఇద్దరు కూలీలైన దయాళ్‌, సేత్‌రాంల మధ్య వాగ్వాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ చాలా సేపు వాదించుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలోనే క్షణికావేశానికి గురైన సేత్‌రాం చాకుతో దయాళ్‌పై దాడి చేశాడు. ఛాతీపై బలంగా పొడవడంతో దయాళ్‌ అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని