Crime news: హయత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్య

నగరంలోని హయత్‌నగర్‌లో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.

Updated : 23 Oct 2021 11:38 IST

హైదరాబాద్‌: నగరంలోని హయత్‌నగర్‌లో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. బావర్చీ హోటల్‌ వద్ద కారులో వ్యక్తి హత్య జరిగింది. వ్యక్తిపై కారం చల్లిన దుండగులు హత్యకు పాల్పడ్డారు. కారులో చనిపోయి ఉన్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుని వివరాలను సేకరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు