Crime News: లక్షణమైన భార్యను లక్షకు అమ్మేశాడు!

కట్టుకున్న భార్యను రూ.లక్షకు అమ్మేసిన ఓ వ్యక్తి చివరికి పోలీసులకు చిక్కాడు. ఒడిశాలోని బొలంగీర్‌కు చెందిన సరోజ్‌రాణాకు, సురేకెల గ్రామానికి చెందిన రేవతికి 3నెలల క్రితం వివాహమైంది....

Updated : 24 Oct 2021 12:19 IST

కటక్‌, న్యూస్‌టుడే: కట్టుకున్న భార్యను రూ.లక్షకు అమ్మేసిన ఓ వ్యక్తి చివరికి పోలీసులకు చిక్కాడు. ఒడిశాలోని బొలంగీర్‌కు చెందిన సరోజ్‌రాణాకు, సురేకెల గ్రామానికి చెందిన రేవతికి 3నెలల క్రితం వివాహమైంది. కొన్నిరోజుల తర్వాత ఉపాధి నిమిత్తం రేవతిని తీసుకొని సరోజ్‌రాణా రాజస్థాన్‌ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుకల బట్టీలో ఇద్దరూ పనిచేసేవారు. కొన్నాళ్ల తర్వాత సరోజ్‌రాణా... ఓ కుటుంబానికి రేవతిని రూ.లక్షకు విక్రయించి స్వగ్రామానికి వచ్చేశాడు. రేవతి ఏదంటూ అతన్ని అత్తమామలు ప్రశ్నించారు. వేరే యువకుడితో వెళ్లిపోయిందని అతను బదులిచ్చాడు. వారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్‌ చేరుకొన్న పోలీసులు రేవతిని కాపాడి గ్రామానికి తీసుకొచ్చారు. సరోజ్‌రాణాను అరెస్టు చేశారు. రేవతి మాట్లాడుతూ.. భర్త తనను అమ్మిన విషయం తెలియదని, ఓ ఇంట్లో పనిచేయాలని చెప్పి వెళ్లిపోయాడని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని