AP News: తల్లి మరణవార్త విని ఏఎస్సై హఠాన్మరణం

పెళ్లింట విషాదం నెలకొంది. వివాహం పూర్తయిన కాసేపటికే వరుడి నానమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ వార్త విని ఆమె కుమారుడూ కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా..

Updated : 07 Nov 2021 06:45 IST

తన కుమారుడి వివాహమైన కొద్ది గంటల్లోనే విషాదం

ఏఎస్సై వెంకటస్వామి

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: పెళ్లింట విషాదం నెలకొంది. వివాహం పూర్తయిన కాసేపటికే వరుడి నానమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ వార్త విని ఆమె కుమారుడూ కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీసుస్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. శనివారం కుమారుడు గోవర్ధన్‌ వివాహం నిర్వహించారు. వెంకటస్వామి తల్లి కోన్నమ్మ(70) అనారోగ్యంతో అనంతపురంలోని ఓ వైద్యశాలలో చేరి మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. తల్లి ఆరోగ్యం గురించి దిగులుపడుతూనే ఆయన కుమారుడి వివాహాన్ని జరిపించారు. పెళ్లి తంతు ముగిసిన కాసేపటికే కోన్నమ్మ ఆసుపత్రిలో మరణించారు. విషయాన్ని బంధువులు ఫోన్‌లో వెంకటస్వామికి చెప్పడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆస్పత్రికి తరలించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని