TS News: చలాన్లు తరచూ వేస్తున్నారని నడిరోడ్డుపై బైక్‌కు నిప్పు

చలాన్లు తరచూ వేస్తున్నారని నడిరోడ్డుపై బైక్‌కు నిప్పు ఆదిలాబాద్‌ నేరవిభాగం: ట్రాఫిక్‌ పోలీసుల తీరును నిరసిస్తూ

Updated : 27 Nov 2021 20:35 IST

ఆదిలాబాద్‌ నేరవిభాగం: ట్రాఫిక్‌ పోలీసుల తీరును నిరసిస్తూ ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన మక్బూల్‌ అనే వ్యక్తి స్థానిక అంబేడ్కర్‌ కూడలి సమీపంలోబైక్‌పై వెళుతుండగా ట్రాఫిక్‌ పోలీసులు ఫొటో తీసి ఈ-చలానా కింద జరిమానా వేశారు. దీంతో అసహనానికి గురైన వాహనదారుడు తరచూపోలీసులు చలాన్లు వేస్తున్నారంటూ నడిరోడ్డుపై తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. గమనించిన పోలీసులు మంటలను ఆర్పేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని