TS News: మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు

గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన బుధవారం

Updated : 14 Oct 2021 07:12 IST

తిమ్మాజిపేట, న్యూస్‌టుడే: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నీలమ్మ(50) ఇంట్లో భోజనం చేస్తూ ఉడకబెట్టిన కోడిగుడ్డును తినేందుకు నోట్లో పెట్టుకోగా.. గొంతులోకి జారిపోయి ఇరుక్కుపోయింది. దీంతో ఆమె ఊపిరాడక అక్కడికక్కడే పడిపోయారు. కుటుంబ సభ్యులు గుర్తించి గొంతులో గుడ్డుని బయటికి తీసేలోగానే ఆమె మృత్యుఒడికి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని