Crime News: అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలిలో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలిలో లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్‌

Updated : 11 Dec 2021 17:15 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలిలో లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్దకు రాగానే అదుపుతప్పి ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యార్థిపైకి దూసుకెళ్లింది. అనంతరం రోడ్డుపక్కన ఉన్న మైసమ్మ అమ్మవారి ఆలయ ప్రహరీని ఢీ కొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడు సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రణయ్‌ గౌడ్‌ (20)గా గుర్తించారు. ప్రణయ్‌ ..విజ్ఞాన్‌  ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని