Crime news: మాదాపూర్‌లో కారు బీభత్సం ..యువతి మృతి

మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్‌ వద్ద ఆగివున్న ద్విచక్రవాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది...

Published : 04 Oct 2021 01:10 IST

హైదరాబాద్‌: మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్‌ వద్ద ఆగివున్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి మృతి చెందగా, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. అజయ్‌, జెన్నిఫర్‌ ద్విచక్రవాహనంపై కొత్తగూడ నుంచి సైబర్‌ టవర్‌ వైపు వెళ్తున్నారు. సీఐఐ జంక్షన్‌ వద్దకు రాగానే ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడటంతో ఆగారు.  ఈక్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న జెన్నిఫర్‌ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, అజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని