AP News: నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్టు
పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేసి రూ.లక్షల్లో దండుకున్న కి‘లేడి’, నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దేవేంద్ర కుమార్ తెలిపిన..
తిరుపతి నేరవార్తలు: పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేసి రూ.లక్షల్లో దండుకున్న కి‘లేడి’, నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దేవేంద్ర కుమార్ తెలిపిన వివరాల మేరకు.. విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ తిరుపతిలోని మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడే పని చేస్తున్న సుహాసిని పరిచయమైంది. తాను అనాథనని ఆమె అతనికి చేరువైంది. అనంతరం సునీల్ వాళ్లింట్లో ఒప్పించి సుహాసినిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో ఆమెకు 10 తులాల బంగారం పెట్టారు.
కొన్ని రోజుల తర్వాత తనను చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి అవసరమని భర్త, అత్తమామల నుంచి రూ.6 లక్షలు తీసుకుంది. కొన్నాళ్లకు ఈ ఏడాది జూన్లో డబ్బు గురించి భర్త ఆమెను ప్రశ్నించిగా మరుసటి రోజే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై భర్త అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో నెల్లూరుకు చెందిన మేనమామతో సుహాసినికి గతంలో వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.
సునీల్ తన గురించి ఆరా తీస్తున్నాడని తెలుసుకున్న సుహాసిని అతనికి ఫోన్ చేసి తనకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయినట్లు చెప్పింది. అవాక్కైన అతను ఈ విషయాన్ని పోలీసులతో పాటు మీడియాకు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుహాసినిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఈ మహిళ బాధితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వినయ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొదటి భర్త సహకారంతోనే ఈ తరహా మోసాలకు సదరు మహిళ పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.