సైదాబాద్‌ ఘటన మరువక ముందే.. మంగళ్‌హాట్‌లో మరో బాలికపై అత్యాచారం!

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక హత్యచార ఘటనను మరువక ముందే అదే తరహాలో

Updated : 16 Sep 2021 10:19 IST

మంగళ్‌హాట్‌: హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక హత్యచార ఘటనను మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాంగారు బస్తీలో బాలికపై సుమిత్‌ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. బాలిక అరుపులతో స్థానికులు ఘటనాస్థలికి వెళ్లి రక్షించారు. ఈ క్రమంలో సుమిత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడు హబీబ్‌నగర్‌ పరిధిలో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఘటనాస్థలిని ఏసీపీ నరేందర్‌రెడ్డి పరిశీలించి విచారణ చేపట్టారు. మరోవైపు వైద్యపరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు