Ap News: కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

గుంటూరు జిల్లాలోని కాకుమాను నుంచి బాపట్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అప్పాపురం సమీపంలో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్ళింది. రహదారిపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో

Published : 16 Dec 2021 01:15 IST

అప్పాపురం: గుంటూరు జిల్లాలోని కాకుమాను నుంచి బాపట్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అప్పాపురం సమీపంలో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్ళింది. రహదారిపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో బస్సు కమాన్ కట్ట విరగడంతో కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు, విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బాపట్ల ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని