Crime News: కడపలో ఏటీఎం చోరీ.. రూ.17లక్షల అపహరణ

కడప శివారు కేఎస్‌ఆర్‌ఎమ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది.

Published : 07 Dec 2021 14:04 IST

కడప నేరవార్తలు: కడప శివారు కేఎస్‌ఆర్‌ఎమ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. దుండగులు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో ఏటీఎంలోని రూ.17లక్షల నగదును అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదుగురు వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించారు. అందులోని సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఏటీఎం మిషన్‌ను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఉదయం ఏటీఎం చోరీని గుర్తించిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ వెంకట శివారెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌తో పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు