Crime news: అటవీ సిబ్బందిపై పెట్రోల్‌ పోసిన పోడు సాగుదారులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన ఆజంనగర్‌ అటవీశాఖ రేంజి అధికారి దివ్య, సిబ్బందిపై పోడు సాగుదారులు పెట్రోల్‌ పోసి దాడి చేసిన

Published : 17 Sep 2021 01:45 IST

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన ఆజంనగర్‌ అటవీశాఖ రేంజి అధికారి దివ్య, సిబ్బందిపై పోడు సాగుదారులు పెట్రోల్‌ పోసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది.  పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు గురువారం సాయంత్రం అటవీ అధికారులు పందిపంపుల గ్రామానికి వెళ్లారు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దని నిరసన చేపట్టిన  పోడు సాగుదారులు ఒక్కసారిగా దాడికి దిగారు. పెట్రోల్‌ పోసి దాడికి పాల్పడ్డారు. గతంలోనూ అధికారులు పోడు భూముల్లో నాటిన మొక్కలను సాగుదారులు తొలగించారు. దాడిలో స్వల్పంగా గాయపడిన  అటవీ అధికారి దివ్య భూపాలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని