Crime News: గుంటూరు జిల్లాలో నడి రోడ్డుపై అత్యంత పాశవిక దాడి
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులో ఓ వ్యక్తిపై అత్యంత పాశవికంగా దాడి చేయడం కలకలం రేపింది. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్పై పడేసి కొందరు వ్యక్తులు కాళ్లు, చేతులు
పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులో ఓ వ్యక్తిపై అత్యంత పాశవికంగా దాడి చేయడం కలకలం రేపింది. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్పై పడేసి కొందరు వ్యక్తులు కాళ్లు, చేతులు పట్టుకోగా మరో వ్యక్తి కిరాతకంగా బండరాయితో మోదాడు. దెబ్బలు తాళలేక బాధితుడు విలవిల్లాడుతున్నా ఏ మాత్రం కనికరం లేకుండా చావబాదారు. ఇనుప రాడ్లు, జాకీలతోనూ విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. ఈఘటనలో గాయపడిన వ్యక్తిని సైదాగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాధితుడి కథనం ప్రకారం... పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా వివాహ వేడుకకు హాజరై ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా.. పిడుగురాళ్ల శివారులోకి రాగానే ప్రత్యర్థులు శివారెడ్డి, హేమంత్రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్రెడ్డి, అన్నపురెడ్డి, నరసరావుపేటకు చెందిన పలువురు దాడికి పాల్పడ్డారు. పార్టీల పరంగా పాతకక్షలు , పొలం గట్ల వివాదంలో గొడవల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని బాధితుడు తెలిపారు. నడిరోడ్డుపై దాడి జరుగుతున్నా .. అటుగా వెళ్తున్న వారు చూస్తుండిపోయారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదని బాధితుడు వాపోయాడు.
సైదాపై దాడిని ఖండించిన లోకేశ్, అచ్చెన్నాయుడు
గుంటూరుజిల్లా పిడుగురాళ్ల శివారులో సైదాపై అత్యంత పాశవికంగా జరిగిన దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. తెదేపా కార్యకర్త సైదాపై వైకాపా రౌడీ మూకలు నరరూప రాక్షసులకంటే ఘోరంగా దాడి చేశాయని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం తగాదా సాకుతో వైకాపా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. తెదేపా ఏజెంట్గా పనిచేశారనే కక్షతోనే దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల తీరుతో వైకాపా మూకలు బరితెగిస్తున్నాయన్నారు.
సైదాపై దాడి వైకాపా ఆకృత్యాలకు నిదర్శనమని అచ్చెన్నాయుడు అన్నారు. నాలుగు రోజుల క్రితం దాడి జరిగినా కేసు పెట్టరా అని ప్రశ్నించారు. పోలీసులు ఉన్నది కాపాడటానికా? దాడులు చేయించటానికా అని నిలదీశారు. సైదాపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్చేశారు. సైదా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.