Crime News: జూబ్లీహిల్స్‌లో స్థిరాస్తి వ్యాపారిపై కత్తితో దాడి

జూబ్లీహిల్స్‌లో స్థిరాస్తి వ్యాపారిపై దాడి జరిగింది. వ్యాపారి రవీందర్‌రెడ్డిపై బుధవారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఎస్సై నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ..

Updated : 27 Oct 2021 11:13 IST

జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో స్థిరాస్తి వ్యాపారిపై దాడి జరిగింది. వ్యాపారి రవీందర్‌రెడ్డిపై బుధవారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఎస్సై నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో నివసించే రవీందర్‌రెడ్డి, అతడి బంధువు మోహన్‌రెడ్డికి మధ్య గత కొద్దిరోజులుగా వివాదాలు ఉన్నాయి. బేగంపేట ప్రాంతంలో విక్రయించిన స్థలానికి సంబంధించిన కమీషన్‌ సొమ్ము రూ.6లక్షల వ్యవహారంలో ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మోహన్‌రెడ్డి.. రవీందర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రవీందర్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడికి పాల్పడిన మోహన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని