AP News: అప్పు తీర్చమంటే మహిళను కాలితో తన్నేశాడు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ మహిళపై ఆటోడ్రైవర్ దాడికి పాల్పడ్డాడు.
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ మహిళపై ఆటోడ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఇచ్చిన అప్పు తీర్చమని అడిగిన మహిళను కాలితో తన్నాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. బాధితురాలు ప్రస్తుతం మంగళగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన గోపీకృష్ణ అనే యువకుడికి గోవర్ధని అనే మహిళ గతంలో వడ్డీకి రూ.3లక్షలు అప్పు ఇప్పించింది. అప్పు తీర్చమని అడుగుతుంటే గోపి పట్టించుకోలేదు. దీంతో గోపి స్వగ్రామం చిర్రావూరు వెళ్లి బాకీ తీర్చాలని అడిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గోపి.. గోవర్ధనిని కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె కుప్పకూలింది. కొద్ది సేపటి తర్వాత 100 నంబరుకు గోవర్ధని ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మంగళగిరి రూరల్ పోలీసులు గోపీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా