Double bed room: పత్రాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. రూ.లక్షల్లో వసూళ్లు
పేదల సొంతింటి కలను వారు ఆయుధంగా మలచుకున్నారు. ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసే రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్లో పలువురు అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకున్నారు.
హైదరాబాద్: పేదల సొంతింటి కలను వారు ఆయుధంగా మలచుకున్నారు. ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసే రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్లో పలువురు అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకున్నారు. చివరికి బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. బొమ్మిడాం కుమార్, షేక్ సల్మాన్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని బోరబండ, కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో పలువురి వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇళ్లు కేటాయించినట్టు నకిలీ పత్రాలు సృష్టించి ఒక్కో బాధితుడి నుంచి రూ. 1.50 లక్షల నుంచి రూ. 6.50 లక్షల వరకు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు కుమార్.. పేరు మార్చుకుని నకిలీ ఐడీ కార్డుతో హౌసింగ్ డిపార్ట్మెంట్లో అధికారినని నమ్మించాడు. వీరి బారినపడి ఇప్పటివరకు 100 మంది వరకు మోసపోయి ఉంటారని బాలానగర్ డీసీపీ తెలిపారు.
నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.37లక్షల నగదు, 30 తులాల బంగారం, స్కోడా కారు, రూ.లక్ష విలువ చేసే బజాజ్ పల్సర్ బైక్, 5 నకిలీ ఫ్లాట్ పత్రాలు, 3 మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్ట్యాప్లు, 2 స్టాంపులు, ఒక కలర్ ప్రింటర్, 2 టోకెన్ బుక్స్, 18 నకిలీ పాస్బుక్లు, నకిలీ ఆధార్కార్డులు, పాన్ కార్డులు, డిప్యూటీ ఏఈ నకిలీ ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్వోటీ శంషాబాద్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తగా ఈ కేసును ఛేదించారని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. బొమ్మిడాం కుమార్, షేక్ సల్మాన్లు గతంలో 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారని డీసీపీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM