Hyderabad News: గచ్చిబౌలిలో ప్రమాదం.. రోలింగ్ షట్టర్లో పడి బాలుడి మృతి
ఆటోమేటిక్ రోలింగ్ షట్టర్లో పడి బాలుడు మృతిచెందిన ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా అలమూరు
రాయదుర్గం: ఆటోమేటిక్ రోలింగ్ షట్టర్లో పడి బాలుడు మృతిచెందిన ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా అలమూరు గ్రామానికి చెందిన అర్జున్, దేవి దంపతులు వారి కుమారులు రాజేశ్ (10), భాను ప్రకాశ్లతో కలిసి ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం నగరానికి వచ్చారు. అర్జున్.. గచ్చిబౌలి అంజయ్య నగర్ కేఎన్ఆర్ స్వ్కేర్ భవనంలో సెక్యురిటీ గార్డుగా చేరాడు.
ఈ ఉదయం రాజేశ్ ఆడుకుంటూ వెళ్లి మొదటి అంతస్తులో ఉన్న ఆటోమేటిక్ రోలింగ్ షట్టర్ మీట నొక్కడంతో.. ఒక్కసారిగా షట్టర్ బాలుడిని చుట్టేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుమారుడి కోసం వెతకగా అర్జున్కు షట్టర్ వద్ద బాలుడి కాళ్లు కనిపించాయి. వెంటనే బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్