Crime News: రోడ్డు ప్రమాదంలో నవవధువు.. ఆమె తండ్రి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తండ్రి మృతిచెందిన ఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడెం మండలం పాత మద్దిపడగ

Updated : 28 Aug 2021 21:21 IST

కడెం: రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తండ్రి మృతిచెందిన ఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడెం మండలం పాత మద్దిపడగ గ్రామానికి చెందిన ఓ యువతికి మహారాష్ట్రలోని బల్లార్ష మండలం రాజురాకు చెందిన యువకుడితో ఈ నెల 25న వివాహం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం పెళ్లికొడుకు ఇంటివద్ద విందు భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ముగించుకొని తిరుగుపయనమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కడెం మండలం పాండ్వాపూర్‌ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా వంతెనను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో పెళ్లికూతురు మౌనిక, ఆమె తండ్రి రాజయ్య మృతి చెందారు. పెళ్లి కొడుకుతో పాటు పలువురికి గాయాలయ్యాయి. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా జరిగిన ప్రమాదం పెళ్లింట తీరని విషాదం నింపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని