Crime news: ఓఆర్‌ఆర్‌ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఓఆర్‌ఆర్‌ వద్ద రూ.21 కోట్ల విలువైన సుమారు 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు..

Published : 30 Aug 2021 01:21 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఓఆర్‌ఆర్‌ వద్ద రూ.21 కోట్ల విలువైన సుమారు 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎన్‌సీబీ అధికారులు ఓఆర్‌ఆర్‌పై ఓ ట్రక్కును తనిఖీ చేయగా... పూల మొక్కల చాటున 24 సంచుల్లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. గంజాయితో పాటు మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈఏడాది ఇప్పటి వరకు ఎన్‌సీబీ అధికారులు 7,500 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 25 మందిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని