Crime News: అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు.. రూ.2కోట్ల గంజాయి సీజ్‌! 

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా నగరంలో పట్టుబడింది.

Updated : 15 Nov 2021 16:40 IST

హైదరాబాద్‌: అంతర్రాష్ట్ర గంజాయి ముఠా నగరంలో పట్టుబడింది. ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన సమాచారంతో ముఠాలోని సభ్యులను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. 1,240 కిలోల గంజాయిని విశాఖ సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితుల నుంచి 3 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని