Crime News: మద్యం మత్తులో కారు నడిపిన విద్యార్థులు: మహిళ మృతి, మరొకరికి గాయాలు

వారంతా ఇంజినీరింగ్‌ విద్యార్థులు.. కళాశాల ముగిసిన తర్వాత కలిసి మద్యం సేవించారు. ఆ మత్తులో కారు నడిపి మహిళ మృతికి, వ్యక్తికి గాయాలకు కారణమయ్యారు

Published : 25 Dec 2021 01:33 IST

హైదరాబాద్‌: వారంతా ఇంజినీరింగ్‌ విద్యార్థులు.. కళాశాల ముగిసిన తర్వాత కలిసి మద్యం సేవించారు. ఆ మత్తులో కారు నడిపి మహిళ మృతికి, వ్యక్తికి గాయాలకు కారణమయ్యారు. నిందితులను శిక్షించాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మేడ్చల్‌ -మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎదులాబాద్‌కు చెందిన బత్తుల హనుమాన్‌దాస్‌గౌడ్‌, అతని భార్య నిరంజనితో కలిసి ద్విచక్రవాహనంపై ఘట్‌కేసర్‌ నుంచి ఎదులాబాద్‌కు వెళ్తుండగా.. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో నిరంజని అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన హనుమాన్‌దాస్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన, అదే కారులో పారిపోతున్న విద్యార్థులను స్థానికులు పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. మరో ఇద్దరు విద్యార్థులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన గ్రామస్థులకు పోలీసులు నచ్చజెప్పడంతో వారు శాంతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని