Crime News: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. అందులో ఐదుగురు?

అనంతపురం జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. విడపనకల్లు మండలం డొనేకల్‌ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన

Updated : 29 Dec 2021 20:39 IST

విడపనకల్‌: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని దొనేకల్‌ గ్రామం వద్ద 67వ జాతీయ రహదారిపై  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మార్గంలోని పెద్దవంక వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు వంకలోకి దూసుకెళ్లింది. 30 నుంచి 40 అడుగుల లోతులో  కారు పడిపోయింది. గుంతకల్‌ డీఎస్పీ నర్సింగప్ప, విడనకల్లు ఎస్సై గోపాలుడు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని గజ ఈతగాళ్లు, క్రేన్‌సాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.   దొనేకల్‌, కడగరబింకి గ్రామస్థులు భారీగా తరలివచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని