Crime News: లంచం తీసుకున్న వ్యవహారంలో జుడిషియల్ రిమాండ్కు కస్టమ్స్ అధికారులు
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కస్టమ్స్ అధికారులను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు సీబీఐ ప్రకటించింది. నిన్న బషీర్బాగ్ కస్టమ్స్
హైదరాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కస్టమ్స్ అధికారులను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు సీబీఐ ప్రకటించింది. నిన్న బషీర్బాగ్ కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో ప్రివెన్షన్ విభాగానికి చెందిన ఇద్దరు కస్టమ్స్ అధికారులు రూ. 10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన నిందితుడు షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యాడు. అయితే అతను ప్రతి నెల రెండు, నాలుగో సోమవారం కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో హాజరై సంతకాలు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిందితుడు హాజరు కాకపోవడంతో షరతులు పాటించడం లేదని.. ఇలా అయితే బెయిల్ రద్దు అవుతుందని కస్టమ్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో నిందితుడు బెయిల్ రద్దు కాకుండా చూడాలని కస్టమ్స్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రూ.20వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. చివరకు రూ.10వేలకు ఒప్పందం కుదిరింది.
అదే విషయాన్ని నిందితుడు సీబీఐకి సమాచారం ఇచ్చాడు. నిన్న సాయంత్రం కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో నిందితుడు లంచం ఇస్తుండగా సీబీఐ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన కస్టమ్స్ సూపరింటెండెంట్ సురేష్కుమార్, ఇన్స్పెక్టర్ కిషన్ పాల్ను అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ ప్రధాన కార్యాలయంతో పాటు వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన వారిద్దరినీ ఇవాళ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా.. వారికి న్యాయస్థానం జుడిషియల్ రిమాండ్ విధించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్