Viveka murder case: 8మంది అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 64వ రోజు కొనసాగుతోంది.

Updated : 09 Aug 2021 12:42 IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 64వ రోజు కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అధికారులు ఇవాళ ఎనిమిది మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వీరిలో పులివెందులకు చెందిన శిఖామణి, ఓబులేసు, రఘునాథరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంపత్‌, నీలయ్య, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

మరోవైపు వివేకా హత్యకు వాడిన మారణాయుధాల వెలికితీత ఇవాళ కూడా కొనసాగుతోంది. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌ యాదవ్‌ విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా పులివెందులలోని రోటరీపురం వీధి సమీపంలోని ఓ కాలువలో పడేసిన మారణాయుధాలను వెలికితీసేందుకు వరుసగా మూడో రోజు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ బృందం పులివెందులలోనే వారం పాటు ఉండనున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని