Viveka Murder Case: ప్రొద్దుటూరు కోర్టుకు వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 86వ రోజు కొనసాగుతోంది.

Published : 31 Aug 2021 11:22 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 86వ రోజు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఇవాళ వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని కడప నుంచి ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ 164 సెక్షన్‌ కింద మేజిస్ట్రేట్‌ ముందు దస్తగిరి వాంగ్మూలం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వివేకా ఇంటికి వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగయ్య వాంగ్మూలాన్ని జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని